News28th Apr 04:52 PMSunil Byrisetty1 min read

మానవత్వం ఉండాలి.. హైకోర్ట్ సంచలన తీర్పు

సమాజంలో ఎవరూ చేయలేని పని చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు శుభ్రపరుస్తూ మరణిస్తే ఆ క

మానవత్వం ఉండాలి.. హైకోర్ట్ సంచలన తీర్పు
సమాజంలో ఎవరూ చేయలేని పని చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు శుభ్రపరుస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వారి కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మరణించిన మాణిక్యాలరావు అనే కార్మికుడు విషయంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది. మరో రూ. 20 లక్షలు ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రంలో హర్షం వ్యక్తమవుతోంది.
High Court
30 lakh to the family of sanitation workers
while cleaning manholes
Manikyala Rao's family
పారిశుధ్య కార్మికులు
మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు
Scroll for the next article