Sports22nd Jan 02:58 PMSunil Byrisetty1 min read
భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు!
భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో పీవీ సింధుకు 500వ విజయం దక్కింది. ఇండోనేషియా మాస్టర్స్లో గెలిచి పీవీ సింధు ఈ ఘనత సొంతం చేసుకుంది. డెన్మార్క
భారత షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో పీవీ సింధుకు 500వ విజయం దక్కింది. ఇండోనేషియా మాస్టర్స్లో గెలిచి పీవీ సింధు ఈ ఘనత సొంతం చేసుకుంది. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్ మార్క్ను వరుస సెట్లలో ఓడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురికే ఈ రికార్డు ఉంది. తాజాగా ఆరో షట్లర్గా, తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచింది. పీవీ సింధు 500వ అంతర్జాతీయ విజయంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. దేశ క్రీడాకారులందరికీ పీవీ సింధు విజయం ఆదర్శమని కొనియాడారు.