National14th Oct 09:09 AMSunil Byrisetty1 min read
మైక్రోసాఫ్ట్ లో మరో అగ్ర పదవిని పొందిన భారతీయుడు
మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడు ఇదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, స
మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడు ఇదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు.
విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది.
పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన్ను ఈ హోదా వరించింది.