Business Type19th Sep 10:53 AMSunil Byrisetty1 min read
ఏపీలో జొన్నగిరి బంగారు గని నుంచి ఉత్పత్తి!
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు పంట పండుతోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు పంట పండుతోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ హనుమ ప్రసాద్ వెల్లడించారు. తమ అంచనాల ప్రకారం జొన్నగిరి గని నుంచి తొలినాళ్లలో ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. రానున్న రెండు, మూడేళ్లలో ఈ ఉత్పత్తిని 1,000 కిలోల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.