National29th Aug 01:04 PMSunil Byrisetty1 min read
పాక్ విషయంలో భారత్ మంచితనం
పాకిస్థాన్ తో సరిహద్దు వివాదాలు, ఆక్రమిత కశ్మీర్ సహా అనేక అంశాల్లో శత్రుదేశంగా చూసినా ఆ దేశంపై భారత్ మంచితనం చాటుకుంది. ఒక్క మెసేజ్ తో పాకిస్థాన్లో 1.50 లక్షల ప్రాణాలు సేఫ్ అయ్యాయ
పాకిస్థాన్ తో సరిహద్దు వివాదాలు, ఆక్రమిత కశ్మీర్ సహా అనేక అంశాల్లో శత్రుదేశంగా చూసినా ఆ దేశంపై భారత్ మంచితనం చాటుకుంది. ఒక్క మెసేజ్ తో పాకిస్థాన్లో 1.50 లక్షల ప్రాణాలు సేఫ్ అయ్యాయి. సింధు నదిలో భారీ వరదల ముప్పు ఉందని ముందే గుర్తించిన భారత్ పాకిస్థాన్ ను అప్రమత్తం చేసింది. సట్లెజ్, చినాబ్, రావి నదులపై జలాశయాల గేట్లు ఎత్తనున్న విషయాన్ని పాకిస్థాన్కు రెండు రోజుల ముందే మానవతా దృక్పథంతో తెలియజేసింది. ఆ హెచ్చరికతో పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో సుమారు 1.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరిహద్దుల్లో విభేదాలు ఉండొచ్చు… రాజకీయాలు ఉండొచ్చు… కానీ ప్రాణాలను కాపాడటంలో భారత్ ఎప్పుడూ మానవత్వానికే పెద్దపీట వేస్తుంది. ఇదే భారతీయ సంస్కారం… ఇదే మన ధర్మం… ఇదే భారత్ గొప్పతనం.