National15th Jun 01:06 PMSunil Byrisetty1 min read
ఎయిరిండియా విమానాల్లో తనిఖీలు!
అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ అలర్టైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో నేలకూలి 250 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నేప
అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ అలర్టైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో నేలకూలి 250 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిరిండియా విమానాలను సమగ్రంగా పరిశీలించాలని కేంద్రం ఆదేశించింది. DGCA ఆదేశాలతో ఎయిరిండియా తనిఖీలు చేపట్టింది. 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై స్పెషల్ ఆడిట్ నిర్వహించనుంది. అలాగే భద్రతా ప్రమాణాలపై DGCA నివేదిక కోరింది.