News26th Mar 08:34 AMSunil Byrisetty1 min read

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ స్ఫూర్తితో ఎరుపెక్కిన మదురై

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌షర్ట్స్‌ వలంటీర్లు కదం తొక్కారు. స్వతంత్ర పోరాటయోధులు, యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భ

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ స్ఫూర్తితో ఎరుపెక్కిన మదురై
భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌షర్ట్స్‌ వలంటీర్లు కదం తొక్కారు. స్వతంత్ర పోరాటయోధులు, యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ స్ఫూర్తితో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ అఖిల భారత మహాసభ ఏప్రిల్‌ 2 నుంచి 6 వరకు మదురైలో నిర్వహిస్తోంది. ఈ మహాసభలో సందర్భంగా చేపట్టబోయే రెడ్‌ షర్ట్స్‌ బ్రిగేడ్‌ ర్యాలీకి సన్నాహంగా తమిళనాడు వ్యాప్తంగా రిహార్సల్స్‌ నిర్వహించారు. మదురైలోని తముకం మైదానం (కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగరం)లో నిర్వహించే మహాసభకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న రెడ్‌షర్ట్స్‌ వలంటీర్ల ర్యాలీ ఏప్రిల్‌ 6న సాయంత్రం 3 గంటలకు తెప్పకుళం సమీపంలో ప్రారంభమవుతుంది. భారత విప్లవ పోరాటాల్లో ఒకటిగా నిలిచిన వాచతీ పోరాట యోధులు ఈ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఎంపిక చేసిన 25 వేల మంది రెడ్‌షర్ట్స్‌ వలంటీర్లు ఈ కవాతులో పాల్గొంటారు. శ్రామికవర్గ పోరాట యోధుల యూనిఫాం అయిన ఖాకీ, ఎరుపు దుస్తులు ధరించి ఎర్రజెండాల వెలుగులతో సాగే ఈ కవాతుతో మదురై నగరం ప్రజ్వలిల్లనుంది. ఈ మహా కవాతు కోసం పోరాట స్ఫూర్తి ప్రదాతలు భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు వర్ధంతి రోజు అయిన గత ఆదివారం తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ రిహార్సల్స్‌ నిర్వహించారు.
Bhagat Singh
Rajguru
Sukhdev
Madurai
తమిళనాడు
Scroll for the next article