News27th Jan 01:00 PMSunil Byrisetty1 min read
ఫిబ్రవరి 10 వరకు ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వేను కొనసాగిస్తోంది. డిసెంబర్లో ఈ సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వేను కొనసాగిస్తోంది. డిసెంబర్లో ఈ సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినా సర్వే ఇంకా పూర్తి కాలేదు. టెక్నికల్ కారణాల వల్ల సర్వే ఆలస్యమవుతోంది. దీంతో గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వే ద్వారా ఏపీలోని ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయనున్నారు. ఆన్లైన్ విధానంలో ఈ సర్వే చేపడుతుండగా.. గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. సర్వేలో ఇంటింటికి వెళ్లి 20 రకాల అంశాలపై సమాచారం సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.