News5th Mar 01:32 PMSunil Byrisetty1 min read
మహిళా దినోత్సవం విజయవంతం చేయండి
మహిళా దినోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపుడి అనిత, ఎస్ సవితతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కా
మహిళా దినోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో సహచర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపుడి అనిత, ఎస్ సవితతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళా దినోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు క్రమశిక్షణతో పకడ్బందీగా మహిళా దినోత్సవం నిర్వహించాలని స్పష్టం చేశారు.
స్త్రీ,శిశు,గిరిజన,బీసీ,చేనేత,హోం శాఖ తదితర శాఖలకు చెందిన డైరెక్టర్లు,ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేసి, కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు.