News17th Sep 12:03 PMSunil Byrisetty1 min read
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాలకు సీఎం దంపతులు హాజరు కానున్నారు.