News12th Jul 04:39 PMSunil Byrisetty1 min read
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్(ఐ.ఆర్.ఎం.ఎస్)కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్
ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్(ఐ.ఆర్.ఎం.ఎస్)కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (సి.ఓ.ఆ.ఈ ) జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన హైదరాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే కార్యాలయంలో బాధ్యతల్లో చేరారు. శ్రీవాస్తవ వల్సాద్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించి, ముంబై, వడోదరలో డివిజనల్ ట్రాక్ ఇంజనీర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వంటి వివిధ కీలక పదవులను నిర్వహించారు. రైట్స్లో జీఎం (అర్బన్ ట్రాన్స్పోర్ట్)గా ఆయన పదవీకాలంలో కోల్కతా, కొచ్చి, నాగ్పూర్ మెట్రోలతో సహా మెట్రో ప్రాజెక్టులకు ప్రణాళిక, డిజైన్, టెండరింగ్ ప్రక్రియలలో కృషి చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంగా ఆయన జోన్ పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి కీలక డివిజన్ల బాధ్యతలు నిర్వహించనున్నారు.