National25th Jan 03:10 PMSunil Byrisetty1 min read
భారతీయ అంతరిక్ష కేంద్రం పనులకు ఇస్రో శ్రీకారం
ఇస్రో చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసే పనులను అధికారికంగా ప్రారంభించింది. 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (BA
ఇస్రో చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేసే పనులను అధికారికంగా ప్రారంభించింది. 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (BAS)గా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి మాడ్యూల్ను 2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తొలి కోర్ మాడ్యూల్ తయారీ కోసం అర్హత కలిగిన భారత ఏరోస్పేస్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించింది. 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ధ్రువీకరించారు. కేంద్ర కేబినెట్ 2024 సెప్టెంబర్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్మ్యాప్కు ఆమోదం తెలిపింది.
ఈ స్పేస్ స్టేషన్ను భూమికి 400-450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిమ్న భూ కక్ష్యలో ప్రవేశపెడతారు. పూర్తయ్యే నాటికి ఇది 52 టన్నుల బరువు ఉంటుందని, ఒకేసారి నలుగురు వ్యోమగాములు 3-6 నెలల పాటు నివసించేందుకు వీలుగా ఉంటుందని అంచనా.