Crime17th Apr 02:17 PMSunil Byrisetty1 min read

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా!

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా ఝళిపించింది. జగన్ క్విడ్ ప్రోకో కింద జరిగిన అవకతవకలపై ఈడీ చర్యలకు దిగింది. క్విడ్ ప్రోకో కింద హవాలా జరిగిన ఆరోపణలున్న దాల్మ

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా!
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా ఝళిపించింది. జగన్ క్విడ్ ప్రోకో కింద జరిగిన అవకతవకలపై ఈడీ చర్యలకు దిగింది. క్విడ్ ప్రోకో కింద హవాలా జరిగిన ఆరోపణలున్న దాల్మియా భారత్ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. మొత్తం రూ.793 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో రూ.377 కోట్ల విలువైన భూమి కూడా ఉంది. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ తేల్చింది. కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులు.. సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్ పెట్టుబడి పెట్టినట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించి 2011లో సీబీఐ కేసు నమోదైంది.
YSRCP
Jagan Illegal
Bharathi Cement Factory
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా
భారతీ సిమెంట్స్‌
సీబీఐ కేసు
Scroll for the next article