Politics14th Apr 09:13 AMSunil Byrisetty1 min read
జగన్ బాధితుల కోసం ఏబీవీ వాట్సాప్ నెంబర్ 7816020048
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. పదవులపై ఆశ లేదని, మెరుగైన సమాజం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.
పదవులపై ఆశ లేదని, మెరుగైన సమాజం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు.
'కోడికత్తి' దాడి ఘటనలో నిందితుడైన శ్రీను కుటుంబాన్ని ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు.
"జగన్తో వ్యక్తిగత కక్షలు లేవు. ఆయన చేయాల్సింది చేశారు, నేను చేయాల్సిన పోరాటం చేశాను.
ఆ వివాదాల అధ్యాయం ముగిసింది.
ఇది కొత్త అధ్యాయం" అని పేర్కొన్న ఏబీవీ, జగన్ అక్రమాలను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
జగన్ బాధితులందరికీ నా వంతు సహాయం చేసి, వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తానని వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.
జగన్ బాధితులు ఎవరైనా తనకు సమాచారం అందించవచ్చని, ఇందుకోసం 7816020048 వాట్సాప్ నంబర్ను ప్రకటించారు.