News8th Sep 01:13 PMSunil Byrisetty1 min read
నర్సీపట్నంలో ‘జయహో బీసీ'
‘జయహో బీసీ' సభకు బీసీలు తరలిరావాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. రేపు నర్సీపట్నంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. భారీగా
‘జయహో బీసీ' సభకు బీసీలు తరలిరావాలని టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. రేపు నర్సీపట్నంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. భారీగా తరలివచ్చి బీసీల ఐక్యతను చాటాలని కోరారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలిపారు. గతంలో బీసీ రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి 10 శాతం కోత కోయించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. బీసీల రక్షణ చట్టం తెస్తామని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్కు బీసీల తరపున కృతజ్ఞతలు తెలపాలని విజయ్ పేర్కొన్నారు.