News6th Aug 04:59 PMSunil Byrisetty1 min read
ఇంకో రెండు ఎయిమ్స్ కావాలన్న జనసేన ఎంపీ
ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మంగళగిరి ఎయిమ్స్ ఒకటే సరిపోదని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ అన్నారు. ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించేందుకు
ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మంగళగిరి ఎయిమ్స్ ఒకటే సరిపోదని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ అన్నారు. ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. మంగళగిరి ఎయిమ్స్ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం అందజేశారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్తగా ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగిపోయి, ప్రజలకు ఆధునిక వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, బీహార్లకు ఒకటికి మించి ఎయిమ్స్లు మంజూరు చేసిన విషయాన్ని పేర్కొని, ఏపీకి కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరారు.