News24th Aug 04:55 PMSunil Byrisetty1 min read
విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం
విశాఖలో 3 రోజులపాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు మూడు రోజులు విస్తృత స్థాయి సమావేశ
విశాఖలో 3 రోజులపాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు మూడు రోజులు విస్తృత స్థాయి సమావేశం విశాఖ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మూడు రోజులు పాటు *సేనతో సేనాని* పేరిట జరిగే కార్యక్రమంలో *జనసేన అధినేత పవన్ కళ్యాణ్* పాల్గొంటారన్నారు. 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. 29న ఉదయం 10,
మధ్యాహ్నం పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా పదిమందితో చర్చ ఉంటుందని చెప్పారు.
ఏడాది నుంచి అందించిన సుపరిపాలన మీద చర్చ
జరుపుతామన్నారు. 30 వ తేదీ జనసేన మహా సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సభ ప్రారంభమౌతుందని, సాయంత్రం 6 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని వివరించారు.