News17th Aug 10:43 AMSunil Byrisetty1 min read
అత్యవసరాలకూ నో.. సమ్మెలోకి జూడాలు
ఏపీలో జూనియర్ వైద్యులు(జూడాలు) తగ్గడం లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్న జూడాలు నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను బహి
ఏపీలో జూనియర్ వైద్యులు(జూడాలు) తగ్గడం లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్న జూడాలు నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించారు. స్టైపెండ్ల పెంపులో అన్యాయం జరుగుతోందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్ రెసిడెంట్స్, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్ అత్యవసర సేవల్ని బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటారు. వీరి సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఏపీజీడీఏ), ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏఏపీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏపీ విభాగం, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రతి రెండేళ్లకొకసారి స్టైఫండ్ను పెరగాలి. కానీ అలా జరగడం లేదు. ఈ నేపథ్యంలో జూడాలు 30%పెంపు కోరగా కేవలం 3 శాతం పెంచుతామని చెప్పింది. దీంతో నిరసనగా జూడాలు సమ్మెలోకి వెళ్లారు.