News29th Oct 01:38 PMSunil Byrisetty1 min read

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Andhra Pradesh High Court
Justice Subhendu Samanta
High Court Judges
Judicial Appointments
AP Judiciary
న్యాయ వ్యవస్థ
ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్
Scroll for the next article