Spiritual2nd Jan 02:25 PMSunil Byrisetty1 min read

కనకదుర్గమ్మ ఆలయంలో కీలక నిర్ణయం

వీఐపీల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశార

కనకదుర్గమ్మ ఆలయంలో కీలక నిర్ణయం
వీఐపీల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీఐపీ, వీవీఐపీలు దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రోజుకు 200 నుంచి 300 మంది వీఐపీ, వీవీఐపీలు సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్టు గుర్తించారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh
Kanaka Durga Temple
Indrakeeladri
Vijayawada
VIP Darshan
VVIP Darshan
Temple Administration
దర్శన టికెట్లు
ఆలయ ఆదాయం
సిఫార్సు లేఖలు
Scroll for the next article