News28th Jul 10:43 AMSunil Byrisetty1 min read
భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నేడు నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆహ్వానించారు.
భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నారు.
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నేడు నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆహ్వానించారు. అధికారులు అందరూ సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా యూనిట్ అధికారులకు ఫిర్యాదును అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గిరిజనులు స్వదినియోగం చేసుకోవాలన్నారు.