News29th Dec 03:54 PMSunil Byrisetty1 min read
మంత్రి చొరవతో కోటిపల్లి రేవు పునః ప్రారంభం
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ ద్వారమైన కోటిపల్లి రేవు ఎట్టకేలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో పునః ప్రారంభమైంది. సోమవారం కోటిపల్లి రేవు పంటును కూటమి పార్టీ
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ ద్వారమైన కోటిపల్లి రేవు ఎట్టకేలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో పునః ప్రారంభమైంది. సోమవారం కోటిపల్లి రేవు పంటును కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం రేవు నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. గోదావరి ఉధృతి, ఇతర సాంకేతిక కారణాలవల్ల రేవు రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మంత్రి సుభాష్ సంబంధిత అధికారులతో చర్చించి రేవు పునః ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పూజలు నిర్వహించి కోటిపల్లి రేవును ప్రారంభించారు. రేవు పున: ప్రారంభంతో కోనసీమ జిల్లా అమలాపురంకు వెళ్లే వారు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. రేవు పునః ప్రారంభమైందంటూ స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.