Telangana17th Jul 04:11 PMSunil Byrisetty1 min read
తెలంగాణకు ద్రోహం చేయడానికి చంద్రబాబు కుట్ర
తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని, సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరంచారు. తెలంగాణలో
తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని, సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరంచారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని, ఆ మాట కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలపై నిన్న మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి కుట్ర జరుగుతోందని, బనకచర్లపై పోరాటానికి ఎక్కడివరకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.