Telangana28th Dec 04:07 PMSunil Byrisetty1 min read

జగన్ బాటలో కేటీఆర్

వైఎస్ జగన్ బాటలో కేటీఆర్ నడుస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ర

జగన్ బాటలో కేటీఆర్
వైఎస్ జగన్ బాటలో కేటీఆర్ నడుస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయలు పలికే భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ 'సేల్ ఆఫర్' చూసి మోసపోవద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్లను హెచ్చరించిన కేటీఆర్, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా ఇటీవల మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో జగన్ ఇదే విధంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
Hyderabad
KTR
YS Jagan
Telangana Politics
BRS
Congress Government
Industrial Land
Land Scam Allegations
భూకుంభకోణం ఆరోపణలు
హైదరాబాద్
రాజకీయ వివాదం
Scroll for the next article