Spiritual9th Aug 01:36 PMSunil Byrisetty1 min read
దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే ఏటీఎంలో ప్రసాదం అందుకోవచ్చు. బుక్ చేసుకోగానే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మిషన్ లో ఎంటర్
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే ఏటీఎంలో ప్రసాదం అందుకోవచ్చు. బుక్ చేసుకోగానే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మిషన్ లో ఎంటర్ చేస్తే లడ్డూలు భక్తుల చేతిలోకి వస్తాయి. ఒకటి నుండి ఆరు లడ్డుల వరకు మిషన్ లో పొందవచ్చు. దసరా నవరాత్రుల కల్లా మొదలు పెట్టాలని దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆలయంలో 6 మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలలో సుమారు 30 లక్షల నుండి 35 లక్షల లడ్డులు ప్రతి సంవత్సరం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ దృష్ట్యా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.