Business Type14th Apr 05:35 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఎల్జీ కొత్త ప్లాంట్.. రూ. 5 వేల కోట్లతో!

కూటమి ప్రభుత్వంలో ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. వేల కోట్ల రూపాయలతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లా

ఏపీలో ఎల్జీ కొత్త ప్లాంట్.. రూ. 5 వేల కోట్లతో!
కూటమి ప్రభుత్వంలో ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. వేల కోట్ల రూపాయలతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది నవంబర్లో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కలగనుంది.
Andhra Pradesh
LG Electronics
Nellore Sri City
AP Govt
తిరుపతి జిల్లా
ఫ్రిజ్
ఏసీ
వాషింగ్ మెషీన్
టీవీ
కంప్రెషర్
Scroll for the next article