Politics8th Nov 10:54 AMSunil Byrisetty1 min read
బీహార్ ఎన్నికల్లో లోకేష్ ప్రచారం
విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం పాట్నా కు వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున పాట్నా లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం రెండు సమావేశాల్లో
విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం పాట్నా కు వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున పాట్నా లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం రెండు సమావేశాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్ ప్రసంగినున్నారు. సాయంత్రం 7.30 కి బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొననున్నారు. నవంబర్ 9, ఆదివారం ఉదయం 10 గంటలకు పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పాట్నా నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.