News7th Jan 03:37 PMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన మధ్యప్రదేశ్ ఎంపీ

ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు

పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన మధ్యప్రదేశ్ ఎంపీ
ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పవన్ కళ్యాణ్ మధ్యప్రదేశ్, మాండ్లా ఎంపీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డా. ఫగ్గన్ సింగ్ కులస్తే కలిశారు. ఈ భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, భరోసా ఇచ్చారు.
Andhra Pradesh
Pawan Kalyan
Deputy Chief Minister
Madhya Pradesh MP
Faggan Singh Kulaste
SC ST Welfare Parliamentary Committee
స్థానికేతరులు
కూటమి ప్రభుత్వం
చట్టపరమైన చర్యలు
Scroll for the next article