News4th May 10:21 AMSunil Byrisetty1 min read
భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు!
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల శ్రేయస్సుకోసం గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
ప్రజల శ్రేయస్సుకోసం గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన భారతీయ సంప్రదాయానికి గొప్ప ముద్ర వేసాయని కొనియాడారు.
ఆయన స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకుందన్నారు.
పోలవరం ప్రాజెక్టును సాకారం చేసి భగీరథుని కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
శ్రీ భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం మన సంస్కృతిపై గౌరవానికి నిదర్శనమని మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.