Spiritual1st Oct 09:17 AMSunil Byrisetty1 min read
శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం
నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసుర
నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందాడు. దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురి చేస్తూ లోకాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహ వాహనంతో విరాజిల్లుతూ, అష్టదశ భుజాలతో ఆయుధాలను ధరించి, ఆమె మహిషాసురుని వధించి ధర్మాన్ని స్థాపించారు.
దేవాలయాల్లో ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శించడం గొప్ప అనుభూతి. ఈ రూపం భక్తులకు దుశ్శక్తులపై పోరాడే ధైర్యాన్ని, సత్ప్రవర్తనలో నిలకడను ప్రసాదిస్తుందని నమ్మకం.