Telangana3rd Nov 11:25 AMSunil Byrisetty1 min read
సీజ్ ఫైర్పై మావోయిస్టు పార్టీ ప్రకటన
మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన వి
మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని, ప్రజా సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ప్రభుత్వ వైఖరిని గమనిస్తూనే.. తమ శాంతి ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.