News29th Apr 01:24 PMSunil Byrisetty1 min read
గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ
DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) వారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్
DRDO (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) వారి ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో అత్యాధునికంగా నిర్మించిన క్షిపణి పరిశోధన కేంద్రాన్ని మే 2 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించే నేపథ్యంలో అక్కడ చేపట్టవలసిన బందోబస్తు కార్యక్రమాలు ఇతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు, జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీతో కలిసి సమీక్షించారు.
వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నప్పటికీ ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే నేపథ్యంలో ఇక్కడే భద్రత ఏర్పాట్ల గూర్చి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
క్షిపణి పరిశోధనా కేంద్రాన్ని కృష్ణాజిల్లాలో ప్రారంభించడం దేశానికే తలమానికమన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లాకు గర్వకారణంగా ఉండేలా అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.