News27th Jul 04:15 PMSunil Byrisetty1 min read

మరో భారీ ఎన్ కౌంటర్!

చత్తీస్ ఘడ్,బీజపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. బీజపూర్ జిల్లా సౌత్ వెస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గా

మరో భారీ ఎన్ కౌంటర్!
చత్తీస్ ఘడ్,బీజపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. బీజపూర్ జిల్లా సౌత్ వెస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు.
Chhattisgarh Encounter
Maoist Attack
Security Forces
Bijapur
Naxal encounter
నలుగురు మావోయిస్టులు మృతి
బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్
Scroll for the next article