News4th Jun 05:37 PMSunil Byrisetty1 min read
పర్యాటకానికి ఊపునిచ్చేలా మసులా బీచ్ ఫెస్టివల్!
పర్యాటకానికి ఊపునిచ్చేలా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రేపటి నుంచి 3 రోజులపాటు మసులా బీచ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. మచిలీపట్న
పర్యాటకానికి ఊపునిచ్చేలా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రేపటి నుంచి 3 రోజులపాటు మసులా బీచ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టిన మంత్రి కొల్లు రవీంద్రకు అభినందనలు తెలిపారు. పర్యాటక రంగాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంత్రి కొల్లు స్ఫూర్తితో తీరప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా పర్యాటకాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నానన్నారు. మసులా బీచ్ ఫెస్ట్ను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.