News3rd Jul 03:44 PMSunil Byrisetty1 min read
పెండింగ్ కేసుల పరిష్కారానికి మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్
దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ పని చేస్తోందని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ మె
దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ పని చేస్తోందని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బి.ఎస్.వి.హిమబిందు తెలిపారు. ఈ నెల 1 నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంఫైన్ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2 వ జాతీయ లోక్ అథాలత్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్, లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీచేసుకుంటే ఇరుపక్షాలు విజయం సాధించినట్లే అన్నారు.