Education18th Sep 11:32 AMSunil Byrisetty1 min read
భారీ వర్షాల కారణంగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత వాయిదా
మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీకి స్వల్ప బ్రేక్ పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీ
మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీకి స్వల్ప బ్రేక్ పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికే సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.