Education2nd Jul 10:52 AMSunil Byrisetty1 min read
10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నిర్వహించిన సమావేశానికి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తె
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నిర్వహించిన సమావేశానికి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్కు ఆదేశం ఇచ్చారు. ఈ మేరకు మెమో పాఠశాల కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కానున్నారు.