TTD12th Jul 05:32 PMSunil Byrisetty1 min read
టీటీడీలో అన్యమతస్థులు ఉన్నది వాస్తవమే
తిరుమలలో టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్త సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వా
తిరుమలలో టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్త సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలని, నిరుద్యోగులుగా ఉన్న 590 వేద పండితులకు 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలకు 147 కోట్లు విడుదల కాగా నిలిచిపోయాయని చెప్పారు. విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం వేసేందుకు టీటీడీ సహకారం కావాలన్నారు. టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవమని, కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో పనిచేస్తున్న వేయి మంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.