News4th Dec 03:50 PMSunil Byrisetty1 min read
అబద్ధాలకు అంబాసిడర్ ఎమ్మెల్యే జగన్
రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్ మరోసారి అబద్ధాలతో ప్రచారం చేయడం దారుణమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఐదేళ్ల పాట
రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్ మరోసారి అబద్ధాలతో ప్రచారం చేయడం దారుణమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఐదేళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పరిపాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమని, ఇప్పుడు ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకు అబద్ధాల అంబాసడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, పంట కొనుగోళ్ల వేగం, తక్షణ సహాయ చర్యలపై స్పష్టమైన సమాచారాన్ని ఉన్నట్టుండి వక్రీకరించి ప్రజలో గందరగోళం సృష్టించడం జగన్కు అలవాటైపోయిందని మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉంటుందని, గత ప్రభుత్వం మాదిరిగా రాతపూర్వక హామీలను కూడా నిలబెట్టుకోకుండా మోసం చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న ఈ బాధ్యతారహిత ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం కష్టపడుతుండగా అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.