News16th Oct 10:35 AMSunil Byrisetty1 min read
ప్రధాని పర్యటనలో ఫుడ్ స్టాల్స్ను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల కోసం ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాల్ను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. నంద్యాల కర్నూలు
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల కోసం ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాల్ను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. నంద్యాల కర్నూలు రోడ్డులో ఏర్పాటు చేసిన ఆహార ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ స్టాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. సభకు వచ్చే సామాన్య ప్రజానీకం, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహార పదార్థాలు అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూడాలని కోరారు.