News12th Oct 11:35 AMSunil Byrisetty1 min read
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాని పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 16న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం ను
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాని పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ నెల 16న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని సభకు నియోజకవర్గం నుంచి హాజరయ్యే ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రధాని సభకు హాజరయ్యే వారికి రవాణా, ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.