Spiritual19th Jul 04:06 PMSunil Byrisetty1 min read
శ్రీ రాములవార్ల దేవస్థానం పునః నిర్మాణానికి మంత్రి లోకేష్ విరాళం
మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్
మంగళగిరి 20వ వార్డు కుప్పురావు కాలనీలో పునః నిర్మిస్తున్న హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రాములవార్ల దేవస్థానమునకు మంత్రి నారా లోకేష్ రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు శుక్రవారం కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం పునః నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి నారా లోకేష్ కు 20 వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ శ్రీ రాములవార్ల కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్కు ఉండాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.