News10th Sep 09:38 AMSunil Byrisetty1 min read

నేపాల్ సంక్షోభం.. రంగంలోకి లోకేష్

మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా

నేపాల్ సంక్షోభం.. రంగంలోకి లోకేష్
మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు.
Andhra Pradesh
Nara Lokesh
Nepal Crisis
Citizen Safety
Real Time Governance
War Room
AP Government
Emergency Response
Crisis Management
అత్యవసర స్పందన
సంక్షోభ నిర్వహణ
Scroll for the next article