News15th Oct 01:08 PMSunil Byrisetty1 min read
రేషన్ బియ్యం అక్రమ రవాణా కు చెక్!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ 700 మొబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో తీసుకువచ్చింది. బియ్యంపై అనుమానం
ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ 700 మొబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో తీసుకువచ్చింది. బియ్యంపై అనుమానం వచ్చిన వెంటనే కిట్ల ద్వారా పరీక్షించి అది రేషన్ బియ్యమా కాదా అనేది క్షణాల్లో తేల్చేయవచ్చు. పొటాషియం తయోసైనేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్రావణాలతో ఈ పరీక్ష చేస్తారు. రేషన్ బియ్యం అయితే రంగు ఎరుపుగా మారుతుంది. దీంతో అక్రమ రవాణాలను అరికట్టవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.