News23rd Jan 12:43 PMSunil Byrisetty1 min read
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. కుదిరే పనేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన విధానంపై ఆలోచిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన విధానంపై ఆలోచిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను మంత్రి నారా లోకేష్ ప్రస్తావించడంతో, ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా నిషేధ చట్టాన్ని అధ్యయనంగా తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆ దేశంలో పిల్లల రక్షణ కోణంలో తీసుకున్న చర్యలు ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించి, ఆ అనుభవాలను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ఉదాహరణగా నిలిచే విధంగా ఈ నిర్ణయం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో ఫలితాన్ని ఇవ్వాలంటే చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక మార్పు కూడా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.