News15th Dec 02:25 PMSunil Byrisetty1 min read

ఢిల్లీలో పార్లమెంట్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్‌లో మంత్రి లోకేష్‌కు ఎంపీలు, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో

ఢిల్లీలో పార్లమెంట్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్‌లో మంత్రి లోకేష్‌కు ఎంపీలు, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు. మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ లతో సమావేశం కానున్నారు. విద్య, ఐటి శాఖలకు సంబంధించిన పలు అంశాల పై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరితో భేటీ అయి ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.
Andhra Pradesh
Nara Lokesh
Delhi Visit
Parliament
TDP
TDP Parliamentary Party
Jayant Chaudhary
Ashwini Vaishnaw
Dharmendra Pradhan
అశ్వినీ వైష్ణవ్
ధర్మేంద్ర ప్రధాన్
ఐటీ శాఖ
కేంద్ర మంత్రులు
Scroll for the next article