News12th Jan 12:17 PMSunil Byrisetty1 min read

షిరిడీలో కాకడ హారతిలో మంత్రి లోకేష్

షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులు పర్యటిస్తున్నారు. శ్రీసాయినాధుని దర్శించుకునేందుకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. సోమవారం ఉదయం సాయిసన్నిధిల

షిరిడీలో కాకడ హారతిలో మంత్రి లోకేష్
షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులు పర్యటిస్తున్నారు. శ్రీసాయినాధుని దర్శించుకునేందుకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. సోమవారం ఉదయం సాయిసన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. షిరిడీ చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. అలాగే మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో లోకేష్ ను కలిసేందుకు వచ్చారు.
Andhra Pradesh
Nara Lokesh
Shirdi Sai Baba
Kakad Aarti
Telugu Desam Party
Shirdi Visit
Brahmani Lokesh
Religious Visit
షిరిడీ పర్యటన
ధార్మిక కార్యక్రమం
మహారాష్ట్ర తెలుగు ప్రజలు
Scroll for the next article