News1st Jul 01:33 PMSunil Byrisetty1 min read
మంత్రి నారా లోకేష్ 66వ రోజు ప్రజాదర్బార్లో ప్రజల విజ్ఞప్తులు
ఆపద ఏదైనా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 66వ రోజు ప్రజాదర్బార్ నిర్వహిం
ఆపద ఏదైనా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 66వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు స్వయంగా మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నవించారు. ప్రతిఒక్కరి అర్జీ పరిశీలించిన మంత్రి.. ఆయా సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిఒక్కరికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.