News12th Oct 05:00 PMSunil Byrisetty1 min read

విశాఖ క్రికెట్ స్టేడియంలో మంత్రి లోకేష్ సందడి

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ‘

విశాఖ క్రికెట్ స్టేడియంలో మంత్రి లోకేష్ సందడి
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ‘ఏ-గ్యాలరీ స్టాండ్’తో పాటు మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో ‘మూడో నెంబర్ గేట్’ ను ఐసీసీ ఛైర్మన్ జై షా తో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షులు మిథున్ మన్హాస్, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు. అనంతరం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ను మ్యాచ్ ను జై షాతో కలిసి మంత్రి నారా లోకేష్ వీక్షించారు. లోకేష్ రాకతో స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు చేరుకున్నారు.
Andhra Pradesh
TDP
Sports
Nara Lokesh
Vizag Cricket Stadium
Mithali Raj
Ravi Kalpana
Jay Shah
BCCI
ACA VDCA
Women Cricket
Vizag
మహిళల వన్డే వరల్డ్ కప్
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
సానా సతీష్
మిథున్ మన్హాస్
Scroll for the next article