News1st Dec 11:38 AMSunil Byrisetty1 min read

పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ జోరువానలో సైతం ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేశారు. తుఫాను ప్రభావంతో ముసురు పట్టి కుండపోత వానలు కురుస్తున్న వేళ

పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ జోరువానలో సైతం ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేశారు. తుఫాను ప్రభావంతో ముసురు పట్టి కుండపోత వానలు కురుస్తున్న వేళ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీకి తమ ఇంటికి వచ్చిన మంత్రి నారాయణను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను వందశాతం అమలు చేయడమే కాకుండా చెప్పని పనులను సైతం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ ముఖ్యమంత్రికి గల అపార అనుభవంతో కేవలం పెన్షన్స్ కోసమే ఇప్పటివరకు 50 వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించామన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మందికి నిరాటంకంగా పెన్షన్ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తో పాటు ఉచిత బస్సు ప్రయాణం వంటి అన్ని పధకాలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మరో వంద అన్న క్యాంటిన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Andhra Pradesh Government
Minister Narayana
Pension Distribution
Nellore
Welfare Schemes
Heavy Rains
Cyclone Impact
Door-to-Door Services
Social Welfare
మూడు గ్యాస్ సిలిండర్లు
ఉచిత బస్సు ప్రయాణం
అన్న క్యాంటీన్లు
పేదల సంక్షేమం
Scroll for the next article